సీబీఎస్ఈలో ఇక‌పై కొత్త రూల్‌.. అంద‌రూ పాస్ అవుతారు..!

-

సాధార‌ణంగా విద్యార్థుల్లో కొంద‌రు కొన్ని స‌బ్జెక్టుల్లో చాలా బ్రిలియంట్‌గా ఉంటారు. ఒక‌టి రెండు స‌బ్జెక్టులు మిన‌హా ఇత‌ర స‌బ్జెక్టుల్లో అద్భుత‌మైన ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రుస్తుంటారు. అయిన‌ప్ప‌టికీ ఆ రెండు స‌బ్జెక్టులలో ఫెయిల్ అవుతుంటారు. దీంతో కొన్ని సార్లు విద్యా సంవ‌త్స‌రాన్ని కూడా న‌ష్ట‌పోతుంటారు. అయితే ఇక‌పై సీబీఎస్ఈ విద్యార్థులు ఈ విష‌యంలో దిగులు చెందాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే కొత్త రూల్స్‌ను ప్ర‌వేశ‌పెట్టారు.

సీబీఎస్ఈ విద్య‌ను అభ్య‌సిస్తున్న విద్యార్థుల్లో స‌హ‌జంగానే చాలా మంది గ‌ణితం, సైన్సుల్లో ఫెయిల‌వుతున్నారు. కానీ వారు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, కంప్యూట‌ర్స్ వంటి ఇత‌ర స‌బ్జెక్టుల్లో స్కిల్స్‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అయితే ఆ రెండు స‌బ్జెక్టులలో ఫెయిల్ అవుతుండ‌డం వ‌ల్ల విద్యా సంవ‌త్స‌రాన్ని కోల్పోవాల్సి వ‌స్తుంది. కానీ ఇక‌పై విద్యా సంవ‌త్స‌రాన్ని కోల్పోవాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఆ రెండు స‌బ్జెక్టుల్లో ఫెయిల్ అయినా, ఇత‌ర ఏ స‌బ్జెక్టుల్లో అయినా ప్ర‌తిభ‌ను చాటితే వారిని ఫెయిల్ కాకుండా పాస్ అయిన వారిగా గుర్తిస్తారు.

సీబీఎస్ఈలో త్వ‌ర‌లో అమ‌లు చేయ‌నున్న ఈ విధానం వ‌ల్ల ఎంతో మంది విద్యార్థుల‌కు లాభం క‌లుగుతుంద‌ని ప‌లువురు ఉపాధ్యాయులు అంటున్నారు. కొంద‌రు విద్యార్థులు అనేక స‌బ్జెక్టుల్లో స‌త్తా చాటుతార‌ని, కానీ గ‌ణితం, సైన్సుల్లో ఫెయిల‌వుతార‌ని, అలాంటి వారికి ఈ కొత్త రూల్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, దీంతో విద్యా సంవ‌త్స‌రం న‌ష్ట‌పోకుండా ఉంటార‌ని ఉపాధ్యాయులు ఈ కొత్త రూల్‌కు కితాబిస్తున్నారు. అయితే ఆ రెండు స‌బ్జెక్టుల్లో ఫెయిలై ఇత‌ర స‌బ్జెక్టుల్లో ప్ర‌తిభ చాటితే ఓకే. కానీ అన్ని స‌బ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయితే మాత్రం ఏమీ చేయలేరు. మ‌ళ్లీ అవి చ‌ద‌వాల్సిందే. క‌నుక ఆ విద్యార్థుల‌కు ఈ రూల్ మేలు చేయ‌ద‌ని అధ్యాపకులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version