NEW UPDATE: సుశాంత్ సింగ్ రాజపుత్ సూసైడ్ పై డిప్యూటీ సీఎం సెన్సేషనల్ కామెంట్స్…

-

గతంలో బాలీవుడ్ నటుడు సొంత ఇంట్లోనే సూసైడ్ చేసుకుని మరణించడంతో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపైన తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన విషయాలతో మీడియా ముందుకు వచ్చారు. ఈయన తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో ఒక న్యూ అప్డేట్ వచ్చినట్లు తెలుస్తోంది. సుశాంత్ సింగ్ మృతి కేసులో అతి కీలకమైన ఆధారాలు సిబిఐ సేకరించినట్లు ఫడ్నవీస్ తెలిపారు. నిన్నటి వరకు మాత్రం ఈ కేసులో పురోగతి ఏమీ లేదు అని చెప్పాలి. ఈ కేసులో ఇప్పటి వరకు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలే ఆధారాలుగా పోలీసులు రికార్డు పెట్టుకున్నారు. అయితే ఇటీవల కొందరు వ్యక్తులు స్వయంగా సీబీఐకు ఫోన్ చేసి మరీ ఆధారాలు అందించారట.

అయితే వాటిని అలాగే నమ్మకుండా ఆధారాలపై సమగ్రమైన విచారణ జరిపి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే మీడియాకు సమాచారం అందించి ప్రొసీడ్ అవనున్నారని తెలుస్తుంది.

Previous article
Next article
దేశంలో డ్రగ్స్ వాడకం వలన ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఇలాంటి వాటిని కట్టడి చేయడానికి ఎక్కడికక్కడ రైడ్ లు చేస్తూ భారీగా వివిధ రకాల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంటోంది. కాగా తాజాగా ఏపీలో నంద్యాల జిల్లా ఆత్మకూరులో స్థానిక పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. కాసేపటి క్రితం ఆత్మకూరులో సాయిబాబా నగరులో పోలీసులు సోదాలు నిర్వహించగా దాదాపుగా 15 కేజీల గంజాయిని పట్టుకున్నారు. కాగా ఈ పట్టివేతలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యక్తిని విచారించిన అనంతరం దీని వెనుక ఎవరున్నారు అన్నది బయటకు రానుంది. ఇలాంటి పోలీసులు చేస్తున్న ఆపరేషన్ లను హై లైట్ చేస్తే ముందు ముందు ఇంకా ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేయాలంటే ముందుకు రావడానికి భయపడతారు. ఇక యువత సైతం ఈ మత్తు మందుల భారిన పడకుండా జాగ్రత్త ఉండాలని పోలీసులు సలహాలు ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version