WTC Final : టీమిండియాను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేర్చిన కేన్ మామ

-

టీమిండియాను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కేన్ మామ చేర్చారు.  డబ్ల్యూటీసి 2021-23 ఫైనల్ కు చేరాలనుకున్న శ్రీలంక ఆశలపై న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్స్ నీళ్లు చల్లాడు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ లో అజేయమైన సూపర్ సెంచరీ సాధించిన కేన్ మామ తన జట్టుకు అపురూప విజయాన్ని అందించడంతోపాటు శ్రీలంకను డబ్ల్యూటీసి ఫైనల్ కు చేరకుండా అడ్డుకున్నాడు.

మరోపక్క ఆసీస్ తో నాలుగో టెస్ట్ లో భారత్ విజయావకాశాలు సన్నగిల్లడంతో న్యూజిలాండ్, శ్రీలంక తొలి టెస్ట్ ఫలితంపై డబ్ల్యుటిసి ఫైనల్ బెర్త్ ఆధారపడి ఉండింది. ఈ మ్యాచ్ తో పాటు న్యూజిలాండ్ తో రెండు టెస్టుల్లోను శ్రీలంక గెలిచి ఉంటే, డబ్ల్యూటీసి ఫైనల్ కు చేరి ఉండేది. అయితే, తొలిటెస్ట్ లోనే లంక ఓటమి పాలు కావడంతో ఆసీస్ తో నాలుగో టెస్ట్ ఫలితంతో సంబంధం లేకుండా టీమిండియా దర్జాగా ఫైనల్ కు చేరింది. ఈ ఏడాది జూన్ 7 నుంచి 11 వరకు లండన్ లోని ఓవల్ మైదానం వేదికగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news