మెడికల్ ఎమర్జెన్సీతో ఇండిగో ప్లేన్ అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికుడి మృతి

-

దిల్లీ నుంచి దోహా (ఖతార్‌) బయల్దేరిన ఓ ఇండిగో విమానంలో మెడికల్‌ ఎమర్జెన్సీ చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని వెంటనే దారిమళ్లించి పాకిస్థాన్‌లోని కరాచీలో అత్యవసరంగా దించేశారు. ల్యాండ్‌ అయిన తర్వాత ఎయిర్‌పోర్టు మెడికల్‌ బృందం ఆ ప్రయాణికుడిని పరీక్షించగా.. అప్పటికే మృతిచెందినట్లు వెల్లడించింది. అతడి మరణానికి గల కారణాలపై పూర్తి స్పష్టత లేదు.

దీంతో ఆ ప్రయాణికుడి మృతదేహంతో సహా విమానం తిరిగి దిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ ఘటనపై ఇండిగో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. విమానంలోని ఇతర ప్రయాణికులను దోహా పంపించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. కాగా.. మృతుడు నైజీరియాకు చెందిన 60 ఏళ్ల అబ్దుల్లా అని గుర్తించారు. అతడి మరణానికి గల కారణాలపై పూర్తి స్పష్టత లేదు.

Read more RELATED
Recommended to you

Latest news