T20 World Cup : నమీబియా పై న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ.. టీమిండియా సెమీస్ ఆశలు గల్లంతు !

-

టి20 ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ నమీబియా జట్టు మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో… న్యూజిలాండ్ జట్టు ఏకంగా యాభై రెండు పరుగుల తేడాతో నమీబియా జట్టు పై గ్రాండ్ విక్టరీ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు.. 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఏకంగా 163 పరుగులు చేసింది.

న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ 28 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ 39 పరుగులు, మరియు నిస్సామ్ 35 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు ను అందించారు. అయితే 164 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన నమీబియా జట్టు… చతికల పడింది. 20 ఓవర్లలో ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి 111 పరుగులు మాత్రమే చేసింది.

టాప్ ఆర్డర్ నుంచి… లోయర్ ఆర్డర్ వరకు అందరూ బ్యాట్స్మెన్ విఫలం కావడంతో… న్యూజీలాండ్ జట్టుపై ఘోర పరాజయాన్ని చవిచూసింది నమీబియా జట్టు. దీంతో 52 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో న్యూజీలాండ్ విజయం సాధించడం కారణంగా టీమ్ ఇండియా సెమీ అసలు మరింత కఠినతరం అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news