పవన్ కల్యాణ్ సినిమాలో సాయి ధరమ్ తేజ్..అభిమానులకు ట్రీట్!

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్ వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే జనసేనాని నెక్స్ట్ ఫిల్మ్‌కు సంబంధించిన అప్ డేట్ ఒకటి తాజాగా దర్శకుడు, నటుడు అయిన సముద్రఖని ఇచ్చేశారు. తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినోదయ సిత్తం’ ను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు తెలిపారు.

తాను పవన్ కల్యాణ్ అభిమానినని, అభిమానిగానే పవన్ కల్యాణ్ ను డైరెక్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు నటుడు సముద్రఖని. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని పేర్కొన్నారు. తమిళ భాషలో విజయవంతమైన ఈ పిక్చర్ ను తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేస్తు్న్నట్లు తెలుస్తోంది.

‘వినోదయ సిత్తం’ సినిమా స్టోరిని తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేస్తున్న క్రమంలోనే ఓ పాత్ర కోసం సాయి ధరమ్ తేజ్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. తమిళ్ లో సముద్రఖని పోషించిన పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ పోషించనుండగా, తంబి రామయ్య పాత్రను సాయి ధరమ్ తేజ్ పోషిస్తారట. స్టోరి ప్రకారంగా..పవన్ కల్యాణ్ పాత్ర కంటే సాయి ధరమ్ తేజ్ పాత్ర నిడివియే ఎక్కువగా ఉంటుందని టాక్.

Read more RELATED
Recommended to you

Latest news