సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్

-

జస్టిస్ రంజన్ గొగొయ్ సుప్రీం కోర్టు తదుపరి న్యాయమూర్తిగా నియమితులు కానున్నారు. ప్రస్తుత సీజేఐ గా బాధ్యతలు నిర్వహిస్తున్న జస్టిస్ దీపక్ మిశ్రా త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా తన తర్వాత సీజేఐగా అర్హులైన వారి పేరును  సిఫార్సు చేయాల్సిందిగా కేంద్ర న్యాయ శాఖ దీపక్ మిశ్రని కోరగా ..తన అభిప్రాయాన్ని ఓ లేఖ ద్వారా తెలియజేస్తూ… జస్టిస్ రంజన్ గొగోయ్ పేరును సిఫార్సు చేశారు. 2017 ఆగస్టు 28న భారత 45 వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ దీపక్ మిశ్రా అక్టోబర్ 2న పదవీ విరమణ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తర్వాత రంజన్ గొగోయ్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news