సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ… చెలరేగి ఆడిన పూరన్

-

సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంకా ఐపీఎల్ ప్రారంభమే కాలేదు.. ఎందుకు అంతల సంతోష పడుతున్నారని అనుకుంటున్నారా..? అయితే దీనికి కారణం నికోలస్ పూరన్. ఇటీవల జరిగిన నికోలస్ పూరన్ ను సన్ రైజర్స్ రూ. 10.75  కోట్లుకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ వేళంలో సన్ రైజర్స్ యాజమాన్యం మంచి ప్లేయర్లను అసలు కొనడం లేదని.. ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్న వేళ నికోలస్ పూరన్ వంటి స్టార్ బ్యాటర్ ను కొనుగోలు చేసింది.

అయితే తాజాగా నికోలస్ పూరన్ రెచ్చిపోయి ఆడుతున్నారు. అధ్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ట్రినిడాడ్ టీ10 లీగ్ లో విరుచుకుపడుతున్నాడు. తాజాగా కేవలం 14 బంతుల్లోనే 54 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. అంతకుముందు కేవలం 37 బంతుల్లోనే 101 పరుగు చేసి అదుర్స్ అనిపించాడు. ఈ రెండు మ్యాచుల్లో కలిపి 18 సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు. పూరన్ ఆటతీరును చూసి సన్ రైజర్స్ ఫ్యాన్ సంతోషపడుతున్నారు. ఐపీఎల్ కు ముందు సూపర్ ఫామ్ లో ఉండటంతో తమకు కలిసి వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news