అది మా తప్పే అంటూ అసలు విషయాన్ని బయటపెట్టిన నిఖిల్.. ఏమైందంటే..!

-

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రస్తుతం కార్తికేయ 2 సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఆగస్టు 13వ తేదీన విడుదలై దక్షణాది సినీ ఇండస్ట్రీలోనే కాదు సినీ ఇండస్ట్రీలో కూడా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది. సుమారుగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. తాజాగా అనుపమ పరమేశ్వరన్ , నిఖిల్ మళ్లీ కలిసి నటిస్తున్న చిత్రం 18 పేజెస్. సూర్య ప్రతాప దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను జిఏ 2 పిక్చర్స్ సుకుమార్ రైటింగ్స్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా సినిమా నుంచి వరుస పాటలు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే “ఏడు రంగుల రెండు కళ్ళల్లోనా.. కారణం ఎవరంటే ” అనే పాటను విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా నుంచి ఈ పాటను విడుదల చేయడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోని ఒక మీడియా ప్రతినిధి నిఖిల్ ప్రశ్నిస్తూ ఈ సినిమాని ఎందుకు చూడాలి ? ఈ సినిమాలో డైరెక్టర్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పారు. అని అడిగారు మీడియా ప్రతినిథి..

ఆ క్రేజీ పాయింట్ చెప్పేస్తే అది సినిమా ఎలా అవుతుంది సార్ .. 17వ తేదీ ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల కాబోతోంది . ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది అంటూ చెప్పుకొచ్చారు నిఖిల్. అయితే సినిమా ఫినిష్ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటివరకు సినిమా నుంచి ట్రైలర్ కానీ, టీజర్ కానీ విడుదల చేయలేదు. అది మా తప్పే.. అందుకే ఈసారి 17వ తేదీ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నాము .. దీని తర్వాత మీకు సినిమాపై క్లారిటీ వస్తుంది అని నిఖిల్ తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news