బిగ్ బ్రేకింగ్; నిర్భయ దోషుల ఉరి వాయిదా…!

-

నిర్భయ దోషుల ఉరి మరోసారి వాయిదా పడింది. డెత్ వారెంట్ పై స్టే ఇవ్వాలని నిర్భయ దోషి పవన్ గుప్తా పాటియాలా హౌస్ కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసాడు. దీనిపై పాటియాలా హౌస్ కోర్ట్ స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఉరిని వాయిదా వెయ్యాలని తీర్పు వెల్లడించింది. ఇటీవల మార్చ్ 3 న ఉరి తీయాలని డెత్ వారెంట్ జారీ చేసింది కోర్ట్. ఇప్పుడు మళ్ళీ అదే కోర్ట్ స్టే విధిస్తూ తీర్పు ఇచ్చింది.

దీనితో వాళ్ళను ఎప్పుడు ఉరి తీస్తారు అనేది స్పష్టత రావడం లేదు. ఇప్పటికే పవన్ గుప్తా క్షమాభిక్ష పిటీషన్ ని రాష్ట్రపతి కొట్టివేశారు. క్షమాభిక్ష పిటీషన్ కొట్టేసిన 14 రోజుల్లోగా ఉరి తీయాలి. దీనితో మళ్ళీ కోర్ట్ ఎప్పుడు డెత్ వారెంట్ ఇస్తుంది అనేది స్పష్టత రావడం లేదు. ఏది ఎలా ఉన్నా సరే ఇలాంటి పరిణామాలు న్యాయవ్యవస్థను వెక్కిరించడమే అంటున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా పలువురు విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి వారిని రేపు ఉదయం ఆరు గంటలకు ఉరి తీయాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news