లాక్‌డౌన్‌.. కొడుక్కి హేయిర్‌ కట్‌ చేసిన హీరోయిన్‌

-

కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. నిత్యావసరాలు మినహా.. ఇతర షాప్‌లు అన్నీ మూతపడ్డాయి. స్కూళ్ల నుంచి ఆఫీస్‌ల వరకూ అన్నింటిని బంద్‌ చేశారు. ఈ క్రమంలో సెలబ్రిటీలు సైతం ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు ఫిట్‌నెస్‌ మీద దృష్టి సారిస్తే, మరికొందరు కిచెన్‌ పనుల్లో నిమగ్నమైపోయారు.

హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ సోదరి నిషా అగర్వాల్‌ కూడా తన కుమారుడు ఇషాన్‌తో కలిసి క్వారంటైన్‌ టైమ్‌ ఇంట్లోనే గడుపుతున్నారు. ఇషాన్‌ అల్లరిని ఎంజాయ్‌ చేస్తూ, ఆటలు ఆడిస్తూ బిజీగా మారారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. తాజాగా తన కొడుక్కి హేయిర్‌ కట్‌ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన నిషా.. ‘మనం లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు చేసే పనులు ఇవే. నాలోని బార్బర్‌ను బయటికి తీసుకొచ్చినందుకు చాలా ఎంజాయ్‌ చేశాను’ అని తెలిపారు. కాగా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో సెలూన్‌ షాప్‌లు కూడా మూతపడిన సంగతి తెలిసిందే. అందుకే నిషా.. సరదాగా ఆమెలోని ఓ కళను ప్రదర్శించినట్టు ఉన్నారు.

కాగా, సంపత్‌ నంది దర్శకత్వంలో వచ్చిన ఏమైంది ఈవేళ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిషా.. పలు తెలుగు, తమిళ, మాలయాళ చిత్రాల్లో నటించారు. అయితే ఆశించిన స్థాయిలో పేరు రాలేదు. ఆ తర్వాత కరణ్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రస్తుతం నిషా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

 

View this post on Instagram

 

Things we do when we r locked down! I thoroughly enjoyed bringing out my inner barber ❤️? ? @mastkarandar

A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) on Apr 10, 2020 at 9:46pm PDT

Read more RELATED
Recommended to you

Latest news