సర్ప్రైజ్ ఇచ్చిన నితిన్.. రంగ్ దే కంటే ముందే చెక్..

-

హీరో నితిన్ నుండి వరుసగా నాలుగు సినిమాలు వస్తున్నాయి. భీష్మ తర్వాత వరుసగా సినిమాలని ఒప్పుకున్నాడు. ఐతే అందులో నుండి రంగ్ దే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాడు కూడా. వేసవి కానుకగా రంగ్ దే మూవి ఏప్రిల్ లో విడుదల అవనుంది. ఐతే ఈ సంవత్సరంలో నితిన్ నుండి వచ్చే మొదటి సినిమా రంగ్ దే అని అనుకున్నారు. కానీ అలా అనుకున్న వారందరికీ షాక్ ఇస్తూ, చెక్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. తాజాగా ట్విట్టర్ లో ట్వీట్ చేసిన నితిన్, చెక్ సినిమా ఫిబ్రవరి లో విడుదల అవుతుందని ప్రకటించాడు.

ఫిబ్రవరి 19వ తేదీన థియేటర్లలోకి సినిమా వస్తుందట. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపిస్తున్న చెక్ సినిమా టీజర్ రిలీజై అందరి నుండి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఐతే ప్రస్తుతం సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు కాబట్టి, మరికొద్ది రోజుల్లో ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు. నితిన్ సినిమా కోసం సమ్మర్ దాకా వెయిట్ చేయాలా అని ఆలోచించే అభిమానులకి సర్ప్రైజింగ్ గిఫ్ట్ గా ఫిబ్రవరిలో చెక్ సినిమా రిలీజ్ అవడం ఆనందించే విషయమే. కళ్యాణి మాలిక్ సంగీతం అందించిన ఈ సినిమకి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news