బ్రేకింగ్: రాజకీయాలకు సీఎం గుడ్ బై…!

-

బీహార్ కి మూడు సార్లు సిఎంగా పని చేసిన నితీష్ కుమార్ ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. బీహార్ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రచారంలో చివరి రోజు ఆయన ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేసారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అని, అంతా ప్రశాంతంగా ముగుస్తుంది అని అన్నారు. బీహార్ ప్రజలు జాగ్రత్తగా ఎన్నుకోవాలి అని ఆయన సూచించారు. ఆయన జనతా దళ్ యునైటెడ్ కి అధ్యక్షుడిగా ఉన్నారు.

రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. 15 ఏళ్ళ నుంచి ఆయన బీహార్ ని పాలిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన ప్రధాని కావాలి అని భావించినా సరే అందుకు అనుగుణంగా పరిస్థితి కనపడలేదు. అయితే ఆయనకు ఇప్పుడు ప్రజాదరణ తగ్గింది.

Read more RELATED
Recommended to you

Latest news