మెంటల్ మదిలో హీరోయిన్ కి ఫాగల్ లో అవకాశం..

-

మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించిన విమర్శకులచే ప్రశంసలు అందుకున్న నివేథా పేతురాజ్, తాజాగా మరో కొత్త సినిమాలో అవకాశం అందుకుంది. నాన్ బాహుబలి హిట్ గా నిలిచిన అల వైకుంఠపురములో నటించిన ఈ అమ్మడుకి పాగల్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఫలక్ నుమా దాస్ సినిమాతో హిట్ అందుకున్న విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నివేథా పేతురాజ్ కూడా భాగం కానుందని వినిపిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమాలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. కొత్త దర్శకుడు నరేష్ రెడ్డి రూపొందిస్తున్న ఈ సినిమా, లాక్డౌన్ కంటే ముందే మొదలైనా, ఇటీవల తాజాగా చిత్రీకరణ మొదలుపెట్టారు. గ్లామర్ పరంగానూ, నటన పరంగానూ అందరి మన్ననలు పొందుతున్న నివేథా, ఈ సినిమాతో తెలుగులో బిజీ హీరోయిన్ గా మారుతుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news