రేషన్ సరుకుల డోర్ డెలివరీ ఉంటుందా ? ఉండదా ?

-

రేషన్ సరుకుల డోర్ డెలివరీ కార్యక్రమం పై సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే ఫిబ్రవరి ఫస్ట్ నుంచి రేషన్ సరుకుల డోర్ డెలివరీ కార్యక్రమం ప్రారంభించటానికి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇప్పటికే అన్ని జిల్లాలకు డోర్ డెలివరీ వాహనాలు చేరుకున్నాయి. ఎన్నికల కోడ్ అమలు లోకి రావడంతో   ఎస్ఈసీ వివరణ కోరినట్టు చెబుతున్నారు. ఇది కొత్త పథకం కాదు అని పౌర సరఫరాల శాఖ వివరణ ఇవ్వనున్నట్టు చెబుతున్నారు.

2019 సెప్టెంబర్ లోనే శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా సీఎం జగన్ ప్రారంభించారని, అప్పటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో డోర్ డెలివరీ విధానం కొనసాగుతున్నదని ఎన్నికల కమిషన్ కి వివరించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడే మరో చిక్కు ఉంది. అదేంటంటే ఈ వాహనాలకు పూర్తీగా జగన్ పార్టీ రంగులతో పాటు జగన్ బొమ్మ కూడా ఉంటుంది. మామూలుగా వీటిని కనపడనీయడానికి ఎన్నికల సంఘం ఒప్పుకోకపోవచ్చు, వాటిని కవర్ చేసి పంపిణీ చేయడం అయితే కుదరదు, సో ఎన్నికల కోడ్ ముగిసే దాకా, ఈ  డోర్ డెలివరీ కార్యక్రమం ఆగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news