ఎన్ని తోక పార్టీలు కలిసి వచ్చినా జగన్ను ఏమి చేయలేవు – మంత్రి రోజా

-

తిరుపతి నుంచి విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మంత్రి రోజాకు ఎయిర్ పోర్ట్ లో కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్ పోర్ట్ నుండి నోవాటెల్ హోటల్ కి వెళ్లారు.రేపు విశాఖ రైల్వే స్టేడియంలో జరగబోయే ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొననున్నారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీడీపీ ,జనసేన లాంటి తోకపార్టీలన్నీ కలిసి వచ్చిన తమకేం ఇబ్బంది లేదన్నారు.

చంద్రబాబు, పవన్ పై మంత్రి రోజా ద్వజమెత్తారు. ఎన్ని తోక పార్టీలు కలిసి వచ్చినా సీఎం జగన్ ని ఏమి చేయలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ టీడీపీ పార్టీని జాకీలు పెట్టి లేపినా జాకీలు విరిగిపోతున్నాయని ఎద్దేవ చేశారు. సీఎం ఆశీస్సులతో మరలా నగరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు.చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీ ,అమిత్ షా.. వంటి వారిని ఎన్నిసార్లు కలిసిన జగన్ ని తాకలేరని అన్నారు. గట్స్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి రోజా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news