మునుగోడులో కూసుకుంట్ల గెలుపును ఎవరూ ఆపలేరు – మంత్రి తలసాని

-

మునుగోడు ఉప ఎన్నికలలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపును ఎవరు ఆపలేరు అని ధీమా వ్యక్తం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలలో బిజెపి గెలిచి చేసిందేమీ లేదని విమర్శించారు.

రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే ఈ ఉప ఎన్నిక సృష్టించాడని మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, బిజెపి ఎమ్మెల్యేలు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి నేతల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రజల టిఆర్ఎస్ వెంటే ఉన్నారని.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news