హైదరాబాద్ లో ఇళ్లు కొనేక్కునే వారికి శుభవార్త..రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల వేలానికి నోటిఫికేషన్

-

హైదరాబాద్ లోని రాజీవ్ స్వగృహ పథకం లో నిర్మించిన ఇండ్లపై హెచ్ఎండీఏ కీలక ప్రకటన చేసింది. రాజీవ్ స్వగృహ పథకంలో భాగంగా నిర్మించిన ఇల్లు అమ్మకానికి హెచ్ఎండిఎ నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లను అమ్మకానికి పెట్టింది. ఈ వేలంలో మొత్తం 2246 ఇండ్లు ఉన్నాయి.

వీటిలో చదరపు గజం కనీస ధర రూ. 2200 నుంచి రూ. 2700 గా నిర్ణయించారు. అలాగే ఖమ్మం జిల్లా పోలేపల్లిలో ని జలజ టౌన్ షిప్ 8 టవర్లో ఏకంగా 576 ఇల్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ చదరపు గజం 1500 రూపాయల నుంచి 2000 వరకు నిర్ణయించారు.

ఇక ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇవాళ్టి అంటే మే 5 వ తేదీ నుంచి వారికి అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా 11800 చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే నెల 14వ తేదీ ఈ వేళ నిర్వహించనున్నామని హెచ్ఎండీఏ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఇక ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news