తెలంగాణలో కొత్తగా 200 వైద్యుల భర్తీకి నోటిఫికేషన్

-

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రం లోని వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్త గూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రామగుండంలలో కొత్త గా నెలకొల్పనున్న వైద్య కళాశాలల్లో 200 వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు వైద్య విద్య సంచాలకుల కార్యాలయం నియామక ప్రకటను విడుదల చేసింది.

తాత్కాలిక ప్రాతి పదికన ఏడాది ఒప్పందంతో సేవలందించేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు.. ఆచార్యులు, సహ ఆచార్యులు, మరియు సహాయ ఆచార్యుల పోస్టులకు దరఖాస్తు చేసు కోవాలని ఆ ప్రకటన లో పేర్కొంది.

అనాటమీ, పిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రో బయోలజీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, కమ్యూనిటీ మెడిసిన్‌, జనరల్‌ మెడిసిన్‌, డెర్మాటాలజీ, తదితర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. ఇక దీని కోసం అభ్యర్థులు ఈ నెల 28 వ తేదీ లోగా ఆన్‌ లైన్‌ లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే.. త్వరలోనే రెగ్యులర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియనూ ప్రారంభిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news