అమెరికాలో మరో భారతీయ విద్యార్ధిని మృతి…!!!

-

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు, తల్లితండ్రుల కళ్ళ ముందే శవమై కనిపిస్తే ఆ తల్లితండ్రులు పడే నరకం మాటల్లో చెప్పలేనిది. వ్యసనాల కారణంగానో, చెడు స్నేహాల కారణంగానో కాదు, ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా జీవితంలో ఉన్నత స్థానాన్ని, చేరుకోవడానికి నిరంతరం కష్టపడే వారి పిల్లలు మృత్యువాత పడటం భరించలేరు. ఈ విధంగానే అమెరికాలో జరిగిన ఒక సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే…

ఆన్రోస్ జెర్రీ అనే యువతి కుటుంబం కేరళ నుంచి వచ్చి కాలిఫోర్నియా లో సెటిల్ అయ్యారు. జెర్రీ చదువులో ఎప్పుడు ముందుండటమే కాదు, పియానో, ఫ్లూట్ వాయించడంలో జెర్రీ నిష్ణాతురాలు, అన్ని సాంస్కృతిక కార్యక్రమాలలోనూ ఉత్సాహంగా పాల్గొనేది. ప్రస్తుతం అమెరికాలోగల  ఇండియానా లోని యూనివర్సిటీ ఆఫ్ నాట్రే డామోలో గ్రాడ్యుయేషన్ కోర్సు చదువుతోంది. అయితే జెర్రీ ఉన్నట్టుండి ఒకరోజు కనిపించకుండా పోయింది…

 

ఆ తరువాత 4వ రోజుకు ఆమె చదువుతున్న యూనివర్సిటీ సమీపంలో ఉన్న ఒక చెరువులో శవమై తేలింది. ఏమి జరిగిందనేది మిస్టరీగానే ఉన్న, ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేని కారణంగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించి ఉండచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా జెర్రీ తల్లితండ్రులు షాక్ కి లోనయినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో ప్రవాస భారతీయ విద్యార్ధుల మరణాలు వరుసగా జరగడంతో  అమెరికాలో ఉంటున్న ఎన్నారైల తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news