త్వరలో ఎన్టీఆర్ చిత్రంతో రూ.100 కాయిన్

-

విశ్వవిఖ్యాత నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నందమూరి తారక రామారావు కు అరుదైన గౌరవం దక్కనుంది. నందమూరి తారకరామారావు చిత్రంతో రూ. 100 కాయిన్ ను త్వరలోనే ముద్రించనున్నారు.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తిగా వెండితో రూ. 100 కాయిన్ తయారు చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు మెంట్ అధికారులు ఎన్టీఆర్ కుమార్తె అయిన దగ్గుబాటి పురందేశ్వరిని కలిసి కాయిన్ నమూన చూపించి సలహాలు కోరారు. దీంతో త్వరలోనే ఎన్టీ రామారావు కాయిన్ అందుబాటులోకి రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news