బ్రేకింగ్ : ఏపీ వరద బాధితులకు ఎన్టీఆర్ రూ.25 లక్షల ఆర్థిక సహాయం

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 15 – 20 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడంతో వరదలు కూడా సంభవిస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు అలాగే రాయలసీమ జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడి ప్రజలు… అనేక కష్టాలకు గురి అవుతున్నారు. అయితే తాజాగా ఈ వరద బాధితులను ఆదుకునేందుకు… జూనియర్ ఎన్టీఆర్ ఆర్థిక సహాయం చేశారు.

వరద బాధితుల కోసం ఏకంగా 25 లక్షల రూపాయలను… జగన్మోహన్రెడ్డి సర్కార్ కు ఇస్తూ జూనియర్ ఎన్టీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఏపీ వరద బాధితులకు.. మొట్టమొదటి నటుడిగా ఎన్టీఆర్ మాత్రమే ఆర్థిక సహాయం చేశారు. కాగా అటు ఏపీ ప్రభుత్వం కూడా వరద బాధితులను ఆదుకునేందుకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఇల్లు కోల్పోయిన వారికి కొత్తగా ఇల్లు నిర్మించేందుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అలాగే భారీ వర్షాల కారణంగా మరణించిన వారికి 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తోంది జగన్ సర్కార్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా పార్టీ తరఫున వరద బాధితులకు లక్ష రూపాయలు చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news