MAA ELECTIONS : మా’ ఎలక్షన్స్ పై జూనియర్ ఎన్టీఆర్ కీలక ప్రకటన!

-

మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికలు చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రకాశ్‌ రాజ్‌ మరియు మంచు విష్ణు ప్యానెల్‌ సభ్యులు నామినేషన్లు వేయగా… ఇరు పక్షాలు ప్రచారం సాగిస్తున్నాయి. అయితే..ఈ నేపథ్యంలో నిన్న ఓ మీడియా ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ పార్టీ లో జూనియర్‌ ఎన్టీఆర్‌ ను కలిశారు.

మా ఎన్నికల్లో నేనే ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న విషయం ఆయనకు చెప్పి ఓటు వేయాలని అభ్యర్థించగా ప్రస్తుత పరిస్థితులపై ఆయన అసహనం వ్యక్తం చేశారని చెప్పారు జీవిత. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే.. చాలా బాధకరంగా అనిపిస్తోందని… ఓటు వేసేందుకు రానని ఆయన తేల్చి చెప్పారని జీవిత అన్నారు.

తనను ఇకపై ఓటు అడగొద్దని కూడా ఎన్టీఆర్‌ చెప్పినట్లుగా జీవిత తెలిపింది. ఇక ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడుతూ… ఎన్టీఆర్‌ చెప్పినట్లు నిజంగా మా పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. ప్రకాష్‌ రాజ్‌ పై విష్ణు ప్యానెల్‌ తెలుగు వాడు కాదని చేసిన వ్యాఖ్యలకు మా ఎన్నికల్లో ప్రాంతీయ వాదాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అంటూ విష్ణను ప్రశ్నించారు. కాగా.. మా ఎన్నికలు అక్టోబర్‌ 10 న జరుగనున్న సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news