ప్యాన్ ఇండియా సినిమాలే చేస్తానంటున్న తార‌క్‌.. ఇప్పుడు మ‌రో డైరెక్ట‌ర్‌

-

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అంటే ఫ్యాన్స్‌కు పూన‌కాలే. మాస్ ప‌ల్స్ ఉన్న హీరోగా ఆయ‌న టాలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు. అన్ని ఫార్మాట్ల‌లో ఆయ‌న సంపూర్ణ న‌టుడిగా నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగూ ఇండియా వైస్‌గా క్రేజ్ వ‌స్తుంది కాబ‌ట్టి దీంతో వ‌రుస‌గా ప్యాన్ ఇండియ‌న్ సినిమాలు చేస్తున్నాడు.

 

ప్యాన్ ఇండియ‌న్ సినిమాల కోసం ఇప్పుడు కోలీవుడ్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌ను లైన్ లోపెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇప్ప‌టికే బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో 30వ సినిమా చేస్తున్న తార‌క్‌.. దీని త‌ర్వాత ప్ర‌శాంత్‌నీల్‌ను క‌న్ఫ‌ర్మ్ చేశాడు.

కొర‌టాల‌తో చేస్తున్న సినిమా త‌ర్వాత ఈ సినిమాను ప్రారంభిస్తారు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ ఎండింగ్‌లో దీన్ని ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది. ఇక ఈ సినిమా త‌ర్వాత బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌ను సంజ‌య్‌లీలా భ‌న్సాలీతో సినిమా చేసేందుకు ప్లాన్‌చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అప్ప‌ట్లో వీరిద్ద‌రి సినిమా ఉంటుంద‌ని వార్తలు వ‌చ్చాయి. కానీ ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్‌తో వ‌స్తున్న క్రేజ్ తో సంజ‌య్ కూడా ఒప్పుకుంటాడ‌ని భావిస్తున్నాడు తార‌క్‌. ఇదే జరిగితే తార‌క్‌నేష‌నల్ స్టార్ అయిపోవ‌డం ఖాయం.

 

Read more RELATED
Recommended to you

Latest news