ఆ ఆదర్శ గ్రామంలో విచిత్ర పరిస్థితి !

-

ఏపీ పంచాయతీ ఎన్నికల విషయంలో రకరకాల విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.  రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (మం)నువ్వలరేవు పంచాయతీ దూరమయింది. ఎందుకంటే నామినేషన్ల చివరి రోజు ఐదు నిమిషాల ముందు కేవలం సర్పంచ్ పదవికి మాత్రమే నువ్వలరేవు గ్రామస్తుడు రఘునాథ్ నామినేషన్ దాఖలు చేశాడు. అయితే నామినేషన్ల పరిశీలనలో సరైన పత్రాలు లేని కారణంగా నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు.

దీంతో నువ్వలరేవులో తొలిసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడినట్టు అయింది. ప్రతీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాలతో ఆదర్శంగా నిలిచే నువ్వలరేవులో ఈ సారి మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక బలవంతపు ఏకగ్రీవాలలో విషయంలో నిమ్మగడ్డ ఇప్పటికే సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఎక్కడ ఎక్కువ ఎకగ్రీవాలు ఉన్నాయో, అక్కడ ఎక్కువ ద్రుష్టి పెడుతున్నారు. దీంతో కాస్త టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news