కోవిడ్ వాక్సిన్ పై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి !

-

హైదరాబాద్ దారుస్సలాంలో  మజ్లిస్ పార్టీ కార్యాలయంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్న ఆయన తీసుకుని తమను తాము కాపాడుకోవాలని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సిన్ తీసుకున్నారు మంచిదే కానీ మోడీ ప్రభుత్వం పేద మధ్య తరగతి కుటుంబాలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా వాక్సీన్ ని తక్కువ ధరకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని డిమాండ్ చేశారు.

తాను కూడా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటానన్న ఆయన ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులను పరిశీలించాలి జర్నలిస్టులకు వ్యాక్సిన్ అందజేయాలని అన్నారు. కోవిడ్ కష్టకాలంలో ఫ్రంట్ లైన్ లో ఉండి కృషి చేసిన జర్నలిస్టులకు వ్యాక్సిన్ ఇప్పించాలని అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని 18 సంవత్సరాల నుండి 64  సంవత్సరాల వారు వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఏం కాదు అని. కానీ 64 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదేనా దీనిపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news