బంగ్లాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ జట్టు ప్రకటన..!

-

వన్డే ప్రపంచ కప్ తరువాత తొలి వైట్ బాల్ సిరీస్ కు సిద్ధమైంది. స్వదేశంలో బంగ్లాదేశ్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో కివీస్ తలపడనుంది. ఈ సిరీస్ తో 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్  క్రికెట్ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కి రెగ్యులర్ కెప్టెన్ విలియమ్సన్ కి సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అతని స్థానంలో టామ్ లాథమ్ ను కెప్టెన్ ఎంపిక చేశారు. 

దేశవాళీ క్రికెట్ లో  అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న లెగ్ స్పిన్నర్ ఆదిల్ అశోక్, జోష్ క్లార్క్ సన్, విల్ ఓ రూర్క్ లకు తొలి వన్డే జట్టులో చోటు దక్కింది. అలాగే వరల్డ్ కప్ లో దుమ్మురేపిన యువ సంచలనం రచిన్ రవీంద్ర కూడా బంగ్లాదేశ్ సిరీస్ కు అందుబాటులో ఉన్నాడు. డిసెంబర్ 17న డునెడిన్ వేదికగా జరుగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ ప్రారంభం కానుంది.

బంగ్లాదేశ్ తో వన్డేలకు కివిస్ జట్టు ఇదే :

టామ్ లాథమ్ (కెప్టెన్), ఆదిల్ అశోక్, జోష్ క్లార్క్ సన్, విల్ ఓ రూర్క్, పిన్ అలెన్, టామ్ బ్లండెల్, మార్క్ చాప్మన్, జోష్ క్లార్క్ సన్, జాకబ్ డఫీ, కైల్ జామిసన్, ఆడమ్ మిల్నే, హెన్రీ నికోల్స్, రచిన్ రవీంద్ర, విస్ సోది, విల్ యంగ్.

Read more RELATED
Recommended to you

Latest news