అనంతపురం జిల్లాకు 471 మంది విదేశీయుల రాక.. ముగ్గురికి కరోనా పాజిటివ్

-

దక్షిణాఫ్రికా దేశంలో పుట్టిన ఓమి క్రాన్ వేరియంట్.. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ఈ కొత్త వేరియంట్ 38 దేశాలకు పాకింది అని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక మన దేశంలోనూ ఇప్పటికే 21 కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో కొత్త వేరియంట్ అనంతపూరం జిల్లాలో కలకలం రేపుతోంది. వివిధ దేశాల నుంచి ఏకంగా 471 మంది అనంతపురం జిల్లాకు వచ్చినట్లు గుర్తించారు అధికారులు. దీంతో విదేశాల నుంచి అనంతపురం జిల్లాకు వచ్చిన వారిప్తె ఆరోగ్య శాఖ నిఘా పెట్టింది.

ఈ నేపథ్యంలోనే.. నిన్న తొలి విడతలో 252 మంది విదేశీ ప్రయాణికులకు కి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు వైద్య శాఖ అధికారులు. అయితే వీరిలో ముగ్గురికీ కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు గుర్తించారు వైద్య శాఖ అధికారులు. దీంతో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించేందుకు హ్తెదరాబాద్ లోని సీసీఎంబీకి నమూనాలు పంపారు అధికారులు. విదేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడం తో అనంతపురం జిల్లా వాసుల్లో ఆందోళన నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news