ఓఆర్ఆర్ మీద ఘోర రోడ్డు ప్రమాదం.. అంత మందిలో మందేసినోళ్లె పోయారు !

-

హైదరాబాద్ నగర శివారులోని నార్సింగి ఓఆర్ఆర్ మీద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో స్పాట్ లోనే ఇద్దరు మృతి చెందారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నగర శివారులోని నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ తెల్లవారుజామున రెండు కార్లు ఢీ కొనడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా ఆరు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళుతున్న సమయంలో నార్సింగి ఫ్లైఓవర్ కింద ఈ ఘటన జరిగింది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జాం అయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఓఆర్ఆర్ ట్రాఫిక్ పోలీసులు. గాయ పడిన వారిని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. హయత్ నగర్ వద్ద యువకులు మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా సూర్యాపేటకు చెందిన వారని నార్సింగి పోలీసులు గుర్తించారు. అయితే ఎవరైతే మద్యం సేవించారో వారిద్దరు మాత్రమే మరణించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news