పంజాగుట్టలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం..మెట్రో రైలింగ్ లో తల !

-

పంజా గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న యువకులు అదుపుతప్పి మెట్రో స్టేషన్ రైలింగ్ లో ఇరుక్కోగా ఒకరు మృతి చెందారు.  శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిరీష్ గుప్తా (24) రవితేజ (22) అనే ఇద్దరు స్నేహితులు శుక్రవారం తెల్లవారుజామున పంజాగుట్ట వైపు నుంచి కెపిహెచ్బి వైపు వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుప్తా మృతి చెందగా రవి తేజ తీవ్రగాయాల పాలయ్యారు.

రైలింగ్ లో తల ఇరుక్కోవడంతో రైలింగ్ ను తొలగించి గిరీష్ గుప్తా మృత దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన రవితేజ పరిస్థితి సైతం విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఇస్తున్నారు. తెల్లవారు జామున 4 : 30 సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగిందని అంటున్నారు. ద్విచక్ర వాహనం వేగంగా నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news