ఐపీఎల్ పై కరోనా పిడుగు : సన్ రైజర్స్ ప్లేయర్ కు పాజిటివ్

-

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ 2021 సీజన్‌ -2… ప్రస్తుతం విజయవంతంగా సాగుతోంది. ఈ నేపథ్యం లోనే మరోసారి ఐపీఎల్‌ టోర్నీ పై మరో సారి కరోనా పిడుగు పడింది. ఇవాళ కరోనా పరీక్షల్లో ఓ ఆటగాడికి పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారించారు. అయితే.. ఆటగాడి పేరు మాత్రం… ప్రకటించలేదు. సన్‌ రైజర్స్‌ బౌలర్‌ నటరాజన్‌ అని తెలుస్తోంది.  నటరాజన్‌ తో సహా పలుగురిని ఐసోలేషన్‌ కు పంపింది యాజమాన్యం.  దీంతో ఆటగాళ్లలో మళ్లీ టెన్షన్‌ నెలకొంది.

కాగా.. ఐపీఎల్‌ 2021 లో ఇవాళ ఢీల్లి క్యాపిటల్స్‌తో…సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. దుబాయి వేదికగా రాత్రి ఏడున్నరకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన SRH కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. దీంతో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇప్పటి నుంచి ఆడుతున్న ప్రతి మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉండగా…. కుర్రాళ్లతో పటిష్టంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టబోతుంది సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు.

Read more RELATED
Recommended to you

Latest news