‘ అల ‘ ట్రెయిలర్ లో అల్లూ అర్జున్ ఫాన్స్ కి కూడా నచ్చని అతిపెద్ద పాయింట్ ఇదే..!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం యొక్క ట్రైలర్ నిన్న రాత్రి విడుదలైంది. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది తమన్ యొక్క నేపథ్య సంగీతం గురించి. ఇకపోతే అల్లుఅర్జున్ ఎప్పటిలాగే ఇరగదీయగా.. పూజా హెగ్డే మరియు నివేత పేతురాజ్ స్క్రీన్ ను తమ అందంతో నింపేశారు. అంతా బాగానే ఉంది కానీ ఈ చిత్రం తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక క్లారిటీకి వచ్చేశారు. అదే ఇప్పుడు వారందరినీ విపరీతంగా భయపెడుతోంది.

సరిలేరు నీకెవ్వరు లో చిత్రం లో కామెడీ ప్రధానంగా అందరి పాత్రలను సమానంగా ఉంచారు. కానీ ఇక్కడ ఒక అల్లు అర్జున్ ను మాత్రమే హైలెట్ చేయడం విశేషం. ఎప్పటినుండో త్రివిక్రమ్ మీద ఒక అపవాదు ఉంది. కుటుంబ కథా చిత్రాలు చేసేటప్పుడు అతను లెక్కకు మిక్కిలి పాత్రలను పెట్టి ఎవరికీ సరైనా పాత్రను ఇవ్వరు అని. అదే కాకుండా ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ కామెడీ తేలిపోయింది.

ఇకపోతే కామెడీ ప్రధానంగా చిత్రాలు తీసే అనిల్ రావిపూడి మిగతా పాత్రలన్నిటితో హాస్యాన్ని మేళవించి ‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ లో కపెట్టడం ఇక్కడ ఒక అల్లు అర్జున్ మాత్రమే ఎక్కువగా సినిమాలో కనిపించడం చూసి ఇలా అయితే సంక్రాంతికి ఫ్యామిలీలు ఎలా వస్తారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.

ఇదంతా పక్కన పెడితే విడుదలైన ట్రైలర్ నెంబర్ వన్ ట్రెండింగ్ అవుతుంది. ట్రైలర్‌లోనే సినిమా చూపించేసాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్‌కు తోడు కామెడీ, యాక్షన్ కూడా మిక్స్ చేశాడు మాటల మాంత్రికుడు. మాస్‌కు కూడా ఈ చిత్రంలో కావాల్సినంత మసాలా ఉందని ఈ ట్రైలర్‌తోనే చూపించేసాడు దర్శకుడు త్రివిక్రమ్.

Read more RELATED
Recommended to you

Latest news