వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు గోదావరిలో కొట్టుకుపోవడం ఖాయం – పువ్వాడ అజయ్

-

సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిపై కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఖమ్మం అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దమ్ముంటే సవాల్ స్వీకరించండి అని అన్నారు. వచ్చే ఎన్నికలలో ప్రతిపక్షాలు గోదావరిలో కొట్టుకుపోవడం ఖాయం అన్నారు పువ్వాడ అజయ్.

కల్లబొల్లి మాటలు చెప్పే నాయకులు వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త ప్రజలారా అని హెచ్చరించారు. నాడు పదవిలో ఉన్నప్పుడు ఏమి చేయలేని వ్యక్తి నేడు కేసీఆర్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడని పొంగులేటిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతకుముందు ఖమ్మం కార్పొరేషన్ 14వ డివిజన్ లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 19వ తేదీన లాంచనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news