తెలంగాణ రాజకీయం: కాంగ్రెస్ లో చేరిన ఆరంజ్ ట్రావెల్స్ ఎండి … !

-

తెలంగాణాలో కాంగ్రెస్ మెల్ల మెల్లగా పుంజుకుంటోంది, సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నాటి నుండి కీలకమైన చాలా నిర్ణయాలను తీసుకుని పార్టీని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లి మళ్ళీ నమ్మకం కలిగేలా చేశాడు. ఇప్పుడు వరుసగా తెలంగాణాలో ఏ పార్టీలో అయినా అసంతృప్తులు ఉంటే.. వారికీ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీనే కనిపిస్తోంది. వరుసగా ఇతర పార్టీల నుండి చేరికలు జరుగుతున్నాయి… ముఖ్యంగా BRS నుండి నలుగురు నాయకులు కాంగ్రెస్ లో చేరారు. తాజాగా ఆరంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ ఈ రోజు కాంగ్రెస్ లో చేరారు. ఈయన ఢిల్లీ లో AICC అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షములో పార్టీ కండువాను పంచుకున్నారు.

కాగా ఈయన ఇంతకు ముందు 2018 ఎన్నికల్లో BSP తరపున పోటీ చేసి BRS నేత వేముల ప్రశాంత్ రెడ్డిపై ఓడిపోయారు. ఇక బీజేపీలోకి వెళ్లాలని ఈయన అనుకున్నా.. రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఈయనను కాంగ్రెస్ లో చేరేలా మాట్లాడారు.

 

Read more RELATED
Recommended to you

Latest news