బెంగళూరు సహా కర్నాటకలోని ఆ ఐదు జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ

-

కర్ణాటకలోని 7 జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ కోసం ఆర్డర్స్ వెలువడ్డాయి. బెంగళూరు, మైసూరు, బీదర్, కల్బుర్గి, మంగళూరు, ఉడిపి, తుమకూరు జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ విధించారు. ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 20 వరకురాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించబడుతుంది.  ఆ సమయంలో ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరియు వారి అటెండర్లు మాత్రమే ప్రయాణానికి అనుమతించబడతారు.

అవసరమైన సేవలు, గూడ్స్ డెలివరీ, ఇ కామర్స్ వారిని మాత్రమే అనుమతిస్తారు. నైట్ షిఫ్టులో పనిచేసే పరిశ్రమల ఉద్యోగులు రాత్రి 10 గంటలకు ముందే పనికి చేరుకోవాలని పేర్కొన్నారు. వైద్య సేవలు మరియు అత్యవసర సేవలు మాత్రమే అనుమతించబడతాయి, ఇతర ఆర్థిక కార్యకలాపాలు పరిమితం చేయబడతాయని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ లేదా ఫ్లైట్) నుండి కర్ఫ్యూ వ్యవధిలో ప్రయాణిస్తున్న వారు తమ ప్రయాణానికి రుజువుగా టిక్కెట్లను అధికారులకు చూపాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news