ఏపీ లో కరోనా డేంజర్ బెల్స్… ఒక్కరోజే ఏకంగా 7998 పాజిటివ్ కేసులు…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ పరిధిలో 24 గంటల్లో నమోదైన కరోనా కేసు వివరాలను హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 58,052 మందికి శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 7998 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించడం జరిగింది. దీంతో నేటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 72,711 కు చేరుకుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 5428 మంది కరోనా వైరస్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నేటి వరకు 37,555 మంది సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక నేడు తూర్పుగోదావరి జిల్లాలో గడచిన 24 గంటల్లో ఏకంగా 1391 కేసులు నమోదవగా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పది వేల మార్కును దాటింది. అంతేకాదు అనంతపూర్, గుంటూరు జిల్లాలో కూడా 1000 కేసులకు పైగా నమోదయ్యాయి. అలాగే కర్నూలు జిల్లాలో కూడా 900 కేసులకు పైగా నమోదవడంతో రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 34, 272 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 61 మంది కోవిడ్ 19 బారినపడి మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మరణాల సంఖ్య 884 కు చేరుకుంది. నేటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14,93,879 మందికి శాంపిల్స్ ను పరీక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news