బ్రేకింగ్: స్పీకర్ సాబ్, కరెక్ట్ కాదు: ఒవైసీ

-

క్వశ్చన్ అవర్ లో స్పీకర్ తో వాగ్వాదానికి ఏంఐఎం నేత అక్బరుద్దీన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దిగారు. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేసారు. ప్రతి పక్ష పార్టీ లకు సభలో మాట్లాడేందుకు 6 నిమిషాల సమయం ఏం సరిపోతుందని ఓవైసీ ప్రశ్నించారు. సభ్యుల సంఖ్య ప్రకారమే సమయం ఇస్తామని స్పీకర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటె దాని పైన చర్చ పెట్టకుండా అనవసర అంశాల పై చర్చ పెడుతున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వానికి మేము ప్రతీ అంశం లో సహాకరిస్తున్నా.. మీరు రూల్స్ మాట్లాడుతున్నారని ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సభలో కరోనా పై చర్చ వెంటనే జరపాలని పట్టుబట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఓవైసీ. కాగా తెలంగాణా అసెంబ్లీలో రెవెన్యూ బిల్లుని మంత్రి కేటిఅర్ ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం సమావేశంలో సిఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news