నేడే దాయాదుల పోరు.. టీమిండియాకు పాక్‌ కెప్టెన్‌ సవాల్‌ !

-

టీ 20 వరల్డ్‌ కప్‌ లో భాగంగా నేడు టీమిండియా మరియు పాకిస్థాన్‌ జట్ల మధ్య మొదటి మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌ లో ఎవరు గెలుస్తారని… ఇరు దేశాల ప్రజలు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ 20 వరల్డ్ కప్ లో భారత్​తో జరగనున్న మ్యాచ్​ను తాము ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామని… ఇరు జట్ల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు.

టీ 20 ప్రపంచకప్​ చరిత్ర లో ఇప్పటి వరకు తమ జట్టు టీమిండియాను ఓడించలేదని… కానీ, అది గతం… ఈ సారి ఓడించి.. చరిత్ర తిరగరాయబోతున్నామని సవాల్‌ విసిరారు. నేటి మ్యాచ్​లో విజయం తమదేనని.. ఒత్తిడిలోనూ ఎలా ఆడాలి అనే దానిపై ప్రణాళికలను రచించామని స్పష్టం చేశారు పాక్ కెప్టెన్ బాబర్ అజామ్. ఈ మ్యాచ్​లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు మైదానంలో నియంత్రణ కోల్పోకుండా ఉంటారని ఆశిస్తున్నానని… టీమ్ఇండియాపై విజయం సాధించేందుకు స్పిన్నర్లతో బరిలో దిగనున్నామని చెప్పారు. ఈ సా రి కచ్చితంగా విజయం సాధిస్తామని ప్రకటించారు పాక్ కెప్టెన్ బాబర్ అజామ్.

Read more RELATED
Recommended to you

Latest news