పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు సౌదీ లో ఘోర పరాభవం

-

పాకిస్థాన్​పై సౌదీ అరేబియా ఇంకా గుర్రుగానే ఉన్నట్లు సమాచారం. ఇటీవల నెలకొన్న పరిస్థితులతో పాక్​తో సత్సంబంధాలు కొనసాగించేందుకు సౌదీ సుముకంగా లేనట్లు తెలుస్తోంది. సౌదీ నాయకత్వాన్ని శాంతింపజేసేందుకు రియాద్​ వెళ్లిన పాక్​ ఆర్మీ చీఫ్​ జనరల్​ కమర్​ జావేద్​ బజ్వా… సౌదీ రాజు మహ్మద్​ బిన్​ సల్మాన్​తో భేటీ కాలేకపోవటమే ఇందుకు నిదర్శనం.

Saudi
Saudi

కశ్మీర్​ అంశంలో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో.. బజ్వాతో పాటు పాక్​ నిఘా విభాగం (ఐఎస్​ఐ) అధినేత జనరల్​ ఫయజ్​ హమీద్​.. సోమవారం సౌదీ అరేబియా వెళ్లారు. సౌదీ రక్షణ శాఖ సహాయ మంత్రి ప్రిన్స్​ ఖలిద్​ బిన్​ సల్మాన్​, సైన్యాధినేత జనరల్​ ఫయద్​ బిన్​ సల్మాన్​ అల్​ రువాలితో భేటీ అయ్యారు. కానీ.., రాజు మహ్మద్​ బిన్​ సల్మాన్​తో భేటీ కాలేకపోయారు.కశ్మీర్​ అంశంలో తమకు మద్దతు పలకాలని సౌదీకి లేఖ పంపింది పాకిస్థాన్​. కానీ.. అందుకు సౌదీ నిరాకరించింది. దీంతో ఓఐసీ(ఆర్గనైజేషన్​ ఆఫ్​ ఇస్లామిక్​ కోఆపరేషన్​)పై పాక్​ విదేశాంగమంత్రి మహ్మద్​ ఖురేషి తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టికల్​ 370 రద్దు చేసి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఓ టీవీ ఇంటర్వ్యూలో సౌదీకి హెచ్చరికలు పంపారు. ఖురేషీ వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సంబంధాలు దెబ్బతిన్నాయి. పాక్​కు ఇచ్చిన 1 బిలియన్​ డాలర్ల రుణాన్ని ముందస్తుగా చెల్లించాలని ఆదేశించింది సౌదీ.

Read more RELATED
Recommended to you

Latest news