అన్నాడీఎంకే చీఫ్ గా ప‌న్నీర్ సెల్వం.. వెన‌క్కి త‌గ్గిన ప‌ళ‌ని స్వామి

-

త‌మిళ‌నాడు అన్నా డీఎంకే పార్టీ లో కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి. అన్నా డీఎంకే పార్టీ ప‌గ్గాల‌ను ప‌న్నీర్ సెల్వం తీసుకోబోతున్నాడు. ఈ విష‌యం లో ప‌ళ‌ని స్వామి, ప‌న్నీర్ సెల్వం కు మ‌ధ్య స‌యోద్య కుద‌రింద‌ని తెలుస్తుంది. దీంతో ప‌న్నీర్ సెల్వం ను అన్నా డీఎంకే పార్టీ నాయకులు ఏక‌గ్రీవం గా ఎన్నుకున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అన్నా డీఎంకే చీఫ్ గా ప‌ళ‌ని స్వామి ఉన్నారు. ఈ తాజా నిర్ణయం తో పళ‌ని స్వామి అధ్య‌క్ష బాధ్య‌త ల నుంచి త్వ‌ర‌లో నే దిగిపోనున్నాడు.

అలాగే నూత‌న అధ్య‌క్షుడి గా ప‌న్నీర్ సెల్వం త్వ‌ర‌లో నే బాధ్య‌త‌లు తీసుకోనున్నాడు. కాగ అన్నా డీఎంకే పార్టీకి కొత్త బాస్ రావ‌డం తో నూత‌న మార్పులు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ గా ఉన్నాయ‌ని తెలుస్తుంది. ముఖ్యం గా జ‌య‌ల‌లిత స్నేహితురాలు శశిక‌ళ విష‌యం లో కీల‌క నిర్ణయం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు అన్నా డీఎంకే చీఫ్ గా ఉన్న ప‌ళని స్వామి శ‌శిక‌ళ ను పార్టీ లో చేర్చు కోవ‌డానికి ఆస‌క్తి చేప‌లేదు.

Read more RELATED
Recommended to you

Latest news