పార్కింగ్‌ వివాదం.. ఇటుకతో దాడి.. ఒకరు మృతి

-

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. కారు పార్కింగ్‌ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. ఓ వ్యక్తిని మరో వ్యక్తి ఇటుకతో కిరాతకంగా తలను పగులగొట్టి చంపాడు.

వరుణ్‌ (35) అనే వ్యక్తి తన ఇంటి సమీపంలో ఉన్న ఓ దాబాకు వెళ్లాడు. తన కారును అక్కడే పార్కింగ్‌ చేశాడు. పక్కనే ఉన్న మరో వాహనం డోరు తీసేందుకు వీలు లేని విధంగా కారును పార్కింగ్‌ చేయడం వివాదానికి దారి తీసింది. ఆ కారు యజమాని వరుణ్‌తో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ జరిగింది.

సహనం కోల్పోయిన నిందితుడు.. వరుణ్‌ తలపై ఇటుకతో గట్టిగా మోదాడు. తీవ్ర గాయాలతో కింద పడిపోయిన వరుణ్‌ను అక్కడే వదిలేసిన నిందితుడు తన స్నేహితులతో కలిసి పరారయ్యాడు. గమనించిన స్థానికులు  వరుణ్‌ను ఆస్పత్రికి తరలించగా అతడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. వరుణ్‌ డెయిరీ వ్యాపారం నిర్వహిస్తుండగా.. అతడి తండ్రి మాజీ పోలీస్‌ అధికారి అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news