MS ధోని ఉంటేనే అతను రాణించగలడు… ఘోరంగా విమర్శలు !

-

ఈ రోజు శ్రీలంక మరియు ఆఫ్గనిస్తాన్ జట్ల మధ్యన మొదటి వన్ డే హంబన్ టోటా లో జరిగిన విషయం తెలిసిందే. ఈ వన్ డే లో ఫేవరేట్ లుగా బరిలోకి దిగిన శ్రీలంక చివరికి పసికూన చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలయింది. హేమాహేమీలు జట్టులో ఉన్నా శ్రీలంక గెలవకపోవడం అభిమానులను ఎంతగానో బాధకు గురి చేసింది. కాగా ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన శ్రీలంక యంగ్ బౌలర్ పతిరణ పై విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ లో చెన్నై తరపున ఆడి ప్లేయర్స్ ను ఇబ్బంది పెట్టిన ఇతను ఈ మ్యాచ్ లో పూర్తిగా తేలిపోయాడు. మొత్తం 8 .5 ఓవర్లు వేయగా కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసుకుని 66 పరుగులు ఇచ్చుకున్నాడు. దీనితో ఇతనిపై విమర్శలు మొదలయ్యాయి..

 

ఇతను కేవలం ధోని కెప్టెన్సీ లోనే రాణించగలడు అని అంటున్నారు. మరి ఇలా వ్యాఖ్యలు చేయడం శ్రీలంక కెప్టెన్ శనకకు చాలా అవమానం అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news