మత్స్యకారులకు పవన్ కల్యాణ్ కీలక హామీ

-

మత్స్యకారులకు జనసేనాని పవన్ కల్యాణ్ కీలక హామీ ఇచ్చారు. మత్య్స సంపత పెంచేందుకు కేంద్రం త్వరలో చర్యలు చేపట్టబోతోందని వెల్లడించారు. కృష్ణా జిల్లా పెడనలో చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ…. జీవో నెం.217 తీసుకొచ్చి మత్య్సకారుల పొట్ట కొట్టారని జగన్ ప్రభుత్వం పై మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వస్తే తీర ప్రాంతాల్లో జెట్టీలు నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అంతేకాదు మత్య్సకారులకు ఉపాధి కల్పించే బాధ్యతను కూడా తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా పెడన ఎమ్మెల్యేపై పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. పెడనలో ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యేకు లంచం ఇవ్వాల్సిందేనని, పెడనలో మట్టి మాఫియా రెచ్చిపోతోందని.. ప్రశ్నించిన వ్యక్తులను చెట్టుకు కట్టి మరీ కొట్టారని మండిపడ్డారు .మున్సిపల్ కార్మికులను సైతం ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళంకారీ, చేనేత కార్మికులకు జగన్ ప్రభుత్వం బకాయిలు ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కళంకారీ కార్మికులకు 5 ఎకరాల్లో రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news