2024 ఎన్నికలలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ : మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య

-

ఆంధ్రప్రదేశ్ లో మే 13న జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అధికార వైసీపీ ప్రభుత్వం ఘోర ఓటమిని చవి చూసింది. వైసీపీకి చెందిన పలువురు మంత్రులందరూ ఓటమి పాలయ్యారు తాజాగా పాలకొల్లు మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్య కామెంట్స్ చేశారు.

ముఖ్యంగా  2024 ఎన్నికలలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ కే అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వల్లే ఈ కూటమి ఇంత ఘనంగా విజయం సాధించింది. రాష్ట్రంలో వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు.  వైసీపీ ఘోర పరాజయానికి జగన్ నిరంకుశ అప్రజాస్వామిక పాలనే కారణం అన్నారు. రాష్ట్రంలో కూటమి విజయానికి ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు ఇమేజ్ తో పాటు జనసేన ఓట్లు ఏకపక్షంగా కూటమికి మళ్లించడమే కారణం అన్నారు హరి రామ జోగయ్య.

 

Read more RELATED
Recommended to you

Latest news