ఆస్పత్రిలో ఉన్న సాయి ధరమ్ తేజ్ కు పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్

-

మెగా సాయి ధ‌ర‌మ్‌ తేజ్, దేవ కట్టాల‌ కాంబినేషన్‌లో పొలిటికల్ డ్రామాగా తెర‌కెక్కినున్న చిత్రం రిపబ్లిక్. ఈ సినిమాపై మొద‌టి నుంచే భారీ అంచ‌నాలున్నాయి. ఇందుకు ప్ర‌ధాన కారణం.. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టా.. గ‌తంలో ప్రస్థానం లాంటి చిత్రాలు తీసి విమర్శకుల ప్రశంసలు పొందాడు. అలాగే.. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్స్ అన్ని ఓ రేంజ్ లో ఉన్నాయి.

ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ట్రైల‌ర్ బుధ‌వారం విడులైంది. ఈ ట్రైలర్ ను సాయి ధరమ్ తేజ్ మామ.. మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ గా లాంచ్ చేశారు. దీంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక తాజాగా.. ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

సాయి ధరమ్ తేజ్ కోసం.. రిపబ్లిక్ డే ప్రి – రిలీజ్ వెంట్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నట్లు పేర్కొంది చిత్రబృందం. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న నేపథ్యంలో… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం రిపబ్లిక్ సినిమా హిట్ చేసెందు కోసం.. అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రిపబ్లిక్ సినిమా ప్రి – రిలీజ్ ఈవెంట్ తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు అధికారికంగా ఈవెంట్ తేదీని ప్రకటించనుంది చిత్రబృందం. సెప్టెంబర్ 25 న ప్రి – రిలీజ్ ఈవెంట్ జరుగనుందని తెలుస్తోంది.  ఈ  కాగా రిపబ్లిక్‌ అక్టోబర్‌ 1 వ తేదీన విడుదల అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news