నేడు గవర్నర్ తో భేటీ కానున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్..!

-

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ నేటి మ‌ధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కానున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ప్రకటన వెలువడింది. “జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను రాజ్ భవన్ లో కలుస్తారు” అని వెల్లడించింది.

కాగా, ఈ భేటీ ఎందుకోసమన్న వివరాలు వెల్లడి కాలేదు. అయితే, తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, ఇసుక సమస్య తదితర అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news