రేపు విశాఖలో మోదీతో పవన్ కల్యాణ్ భేటీ

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. మోదీ రాకతో ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ప్రధాని మోదీతో రేపు విశాఖలో భేటీ కానున్నారు. వీరిద్దరి భేటీ రాజకీయవర్గాల్లో చర్చనీయాశంగా మారింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మోదీతో పవన్‌ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు, తాజా రాజకీయాలపై చర్చించే అవకాశముందని సమాచారం. విశాఖలో బీజేపీ నిర్వహించే ర్యాలీలో పవన్‌ పాల్గొంటారా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. రేపు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పవన్‌ విశాఖ చేరుకుంటారు. రెండ్రోజుల పాటు ఆయన విశాఖలో పర్యటిస్తారని జనసేన వర్గాలు తెలిపాయి. ఇటీవల విశాఖ పర్యటన సందర్భంగా పవన్‌ను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news