Breaking : సీఎం జగన్‌తో ఎంపీ గోరంట్ల మాధవ్‌ భేటీ..

-

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ భేటీ అయ్యారు. మదాసి కురువ, మదారి కురువ కుల సంఘం నేతలతో కలిసి గురువారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వచ్చిన గోరంట్ల మాధవ్… సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ రెండు కులాల వారికి కుల ధృవీకరణ పత్రాల జారీని మరింత సులభతరం చేసిన జగన్ కు ఎంపీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు గోరంట్ల మాధవ్. ఏపీలో మదారి కురువ, మదాసి కురువ కులాల వారికి కుల ధృవీకరణ పత్రాలను మొన్నటి దాకా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) కార్యాలయాల్లో మాత్రమే జారీ చేశారు.

Hindupur MP Gorantla Madhav Meets CM YS Jagan - Sakshi

దీని వల్ల కుల ధృవీకరణ పత్రాలకు కూడా ఈ రెండు కులాల వారు రెవెన్యూ డివిజన్ కు వెళ్లేవారు. అయితే ఇటీవలే ఈ కులాల వారి కుల ధృవీకరణ పత్రాల జారీని ఆర్డీఓ కార్యాలయాల నుంచి మండల రెవెన్యూ ఆఫీసర్ (ఎంఆర్ఓ) కార్యాలయాలకు మార్చారు. ఈ మేర వెసులుబాటు కల్పించినందుకు ఈ రెండు కులాల సంఘాల నేతలతో కలిసి గోరంట్ల సీఎం జగన్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news