విమోచన అనండి లేదా విలీనం అనండి..ఈ రోజు మాత్రం శుభ దినం – పవన్‌ కల్యాణ్‌

-

విమోచన అనండి లేదా విలీనం అనండి..ఈ రోజు మాత్రం చారిత్రాత్మక శుభ దినం అని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్‌ 17 వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌.

ప్రపంచంలోనే పేరు గాంచిన సాయుధ పోరాటానికి జన్మనిచ్చిన పురిటి గడ్డ తెలంగాణ.. అని కొనియాడారు. ఈ పుణ్యభూమికి సంపూర్ణ స్వేచ్ఛ లభించిన రోజు సెప్టెంబర్ 17 అన్నారు. దీనిని విమోచన అనండి లేదా విలీనం అనండి.. ఏ పేరుతో పిలిచినా సరే.. ఈ రోజు మాత్రం చారిత్రాత్మక శుభ దినం.. ప్రజలకు బానిస సంకెళ్లు తొలగిన మరపురాని రోజు అని వెల్లడించారు పవన్‌ కల్యాణ్‌. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సుఖ, సంతోషాలతో ఉండాలని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news