తాడేపల్లిలో అంధ యువతి హత్య శాంతి భద్రతల వైఫల్యమే – పవన్‌ కళ్యాణ్‌

-

తాడేపల్లిలో అంధ యువతి హత్య శాంతి భద్రతల వైఫల్యమే అన్నారు పవన్‌ కళ్యాణ్‌. ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఎన్టీఆర్‌ కట్ట ప్రాంతంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న అంధురాలైన యువతిపై అదే ప్రాంతంలో ఉంటున్న దుండగుడు కత్తితో దాడి చేశాడు.

తీవ్రంగా గాయపడ్డ ఆమెను విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించే లోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఈ సంఘటనపై పవన్‌ కళ్యాణ్‌ స్పందిం చారు.  సీఎం జగన్‌ నివాసానికి దగ్గరలో ఘాతుకాలు జరుగుతున్నా.. మౌనంగా ఉంటారా అని ప్రశ్నించారు. యువతి హత్య సంఘటన తనను కలచి వేసింది… తాడేపల్లి అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిపోయిందని నిప్పులు చెరిగారు పవన్‌ కళ్యాణ్‌. ఈ సంఘటనపై సీఎం జగన్‌ వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు పవన్‌ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Latest news